శంషాబాద్, ఆగస్టు 31: జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గుజరాత్లోని జామ్నగర్కు స్టార్ ఎయిర్ విమాన సర్వీసుల్ని మంగళవారం ప్రారంభించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఎయిర్ కనెక్టివిటి అందించడం ద్వారా ప్రాంతీయ కనెక్టివిటిని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఉడాన్ కార్యక్రమంలో భాగంగా అందుబాటులోకి తెచ్చినట్లు జీఎంఆర్ కమ్యూనికేషన్ అధికార వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. కాగా, జామ్నగర్కు స్టార్ విమాన సర్వీసులు వారానికి మూడు రోజులే నడుస్తాయి. మంగళ, గురు, శనివారాల్లో ఇవి అందుబాటులో ఉంటాయి.