దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న స్పోర్ట్స్ ఎడ్టెక్ స్టార్టప్ “స్పోర్జో” 2 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. ప్రి సిరీస్ ఏ రౌండ్లో ప్రైవేట్ ఇన్వెస్టర్, పునీత్ బాలన్ గ్రూప్, పునీత్ బాలన్ స్టూడియోస్ చైర్మన్ పునీత్ బాలన్.. స్పోర్జోలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. అలాగే భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్తో స్పోర్జో చేతులు కలిపింది. 1996 ఒలింపిక్స్ మెడలిస్ట్ పేస్ ఈ స్టార్టప్నకు వ్యూహాత్మక సలహాదారుగా, అంబాసిడార్గా వ్యవహరించనున్నారు.
క్రీడారంగంలో 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న జీ శ్రీనివాసన్ గత ఏడాది మేలో స్పోర్జోను ప్రారంభించారు. భారత క్రీడా రంగంలో విజయవంతమైన కెరీర్ను నిర్మించుకోవాలనుకునే వారికి సరైన గమ్యస్థానంగా, వారి లక్ష్యాన్ని నెరవేర్చుకునే విధంగా స్పోర్జోను రూపొందించారు. క్రీడల పట్ల ఆసక్తి ఉన్న వారిని ప్రొఫెషనల్స్గా మార్చి భారత క్రీడా రంగానికి 2030 లోగా 5లక్షల మందిని అందించాలని స్పోర్జో లక్ష్యంగా పెట్టుకుంది.
“సంస్థలు, అభ్యర్థులు అందరికీ సవాళ్లు ఉన్నాయి. నమ్మదగిన సమాచారం, నాలెడ్జ్ సరిగా లేకపోవడం అభ్యర్థులకు ప్రధాన అడ్డంకిగా ఉంది. ఉద్యోగానికి సరైన వ్యక్తి దొరకకపోవడం, స్కిల్ గ్యాప్, బిజినెస్ ఆఫ్ స్పోర్ట్స్ గురించి అర్థం చేసుకోలేకపోవడం సంస్థలకు కష్టంగా మారింది. 2024 ఆర్థిక సంవత్సరం కల్లా క్రీడారంగంలో ఉద్యోగాలు గణనీయంగా పెరుగనున్నాయి. అభ్యర్థులు, ఎంప్లాయర్ల మధ్య ఉన్న గ్యాప్ను కనుగొని, ట్రైనింగ్, ప్రొషెషనల్స్ నియామకాలు చేసే సరైన ప్రదేశమే స్పోర్జో” అని స్పోర్జో వ్యవస్థాపకులు, సీఈవో జీ శ్రీనివాసన్ తెలిపారు.
“క్రీడా రంగం అభివృద్ధికి కృషి చేస్తున్న స్పోర్జోతో భాగస్వామిని అవుతున్నందుకు వ్యక్తిగతంగా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. క్షేత్రస్థాయి నుంచి క్రీడల కోసం ఎకో సిస్టమ్ను స్పోర్జో సృష్టిస్తోంది. అన్ని క్రీడల్లో అన్ని విభాగాల్లో విజయవంతంగా నైపుణ్యవంతులను పంపుతామని మేం ఆశిస్తున్నాం” అని టెన్నిస్ దిగ్గజం, స్పోర్జో వ్యూహాత్మక సలహాదారు, అంబాసిడార్ లియాండర్ పేస్ మాట్లాడారు.
భారత క్రీడారంగంలో కెరీర్ను నిర్మించుకోవాలనుకునే వారికి స్పోర్జో సరైన స్థానం. క్రీడారంగంలో ఎడ్యుకేషన్, ట్రైనింగ్, ఎంప్లాయిమెంట్-ఓరియెంటెడ్ శిక్షణ కల్పించే ఆన్లైన్ కంపెనీ స్పోర్జో. క్రీడారంగంలో స్థిరపడాలని కలలు కంటున్న వారికి ఆ దిశగా శిక్షణ ఇచ్చి, ప్లేస్మెంట్లను కూడా కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.