ముంబై, ఆగస్టు 12: స్పైస్జెట్ ప్రయాణీకులు ఇకపై విమానంలో ఉన్నప్పుడే క్యాబ్లను బుక్ చేసుకోవచ్చు. తమ ఇన్-ఫ్లైట్ వినోద వేదిక స్పైస్స్క్రీన్ ద్వారా ఈ సౌకర్యాన్ని ప్యాసింజర్లు పొందవచ్చని సంస్థ తెలియజేసింది. తొలి దశలో భాగంగా ఢిల్లీలో ఈ సదుపాయాన్ని స్పైస్జెట్ గురువారం అందబాటులోకి తెచ్చింది. త్వరలోనే హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై తదితర ప్రధాన ఎయిర్పోర్టుల్లోనూ ప్రారంభించనున్నది. స్పైస్స్క్రీన్ బుకింగ్స్పై ప్రయాణీకులకు ప్రత్యేక డిస్కౌంట్లను ఇస్తున్న స్పైస్జెట్.. ఒకవేళ ఏదైనా కారణంతో క్యాబ్ను క్యాన్సిల్ చేసుకున్నా ఎలాంటి చార్జీలూ ఉండబోవనీ పేర్కొన్నది.