హైదరాబాద్, ఆగస్టు 26: ఉష్ణోగ్రతను నియంత్రించే అత్యాధునిక ఎయిర్కార్గో కంటైనర్లను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో హ్యాండిల్ చేయడం ప్రారంభించినట్లు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్కార్గో (జీహెచ్ఏసీ) తెలిపింది. నెక్ట్స్ జనరేషన్ ఎయిర్ కార్గో కంటైనర్లయిన ‘ఎన్విరోటైనర్ రెలెయే ఆర్ఎల్పీ’ని ఉపయోగించి ఎగుమతులు జరిపిన కార్గో టెర్మినల్ ఇండియాలోనూ, దక్షణాషియాలోనూ ఇదే మొదటిదని జీఎంఆర్ పేర్కొంది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుతో పాటు నియమనిబంధనల్ని సజావుగా అమలుపర్చడానికి ఎన్విరోటైనర్ బృందంతోనూ, భాగస్వామ్య ఎయిర్లైన్ కంపెనీలతోనూ జీహెచ్ఏసీ బృందం కలిసికట్టుగా పనిచేసినట్లు కంపెనీ తెలిపింది. కంటైనర్ పరిశ్రమలో ఎన్విరోటైనర్ తొలిసారిగా ఈ కంటైనర్లను ప్రవేశపెట్టిందని, నియంత్రిత ఉష్ణోగ్రతల్లో వాక్సిన్లు, ఇతర ఉత్పత్తుల్ని ఫార్మా కంపెనీలు ఎగుమతిచేసేందుకు ఈ కంటైనర్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని కంపెనీ వివరించింది. కొవిడ్-19 వ్యాక్సిన్ల ఉత్పత్తికి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్నందున, ఈ వాక్సిన్లను ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయడానికి ఆర్ఎల్పీ కంటైనర్లు ఉపయోగపడతాయని జీఎంఆర్ తెలిపింది.