కరెంట్తో నడిచే ట్రాక్టర్

- మార్కెట్లోకి విడుదల చేసిన సోనాలికా
- ధర రూ.5.99 లక్షలు
ముంబై: దేశీయ మార్కెట్లోకి కరెంట్తో నడిచే ట్రాక్టర్లు వచ్చేశాయి. ప్రముఖ ట్రాక్టర్ల తయారీ సంస్థ సోనాలిక..దేశీయ విపణిలోకి తొలి ఫీల్డ్-రెడీ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ‘టైగర్'ను బుధవారం అందుబాటులోకి తీసుకొచ్చింది. 25.5 కిలోవాట్ల నేచురల్ కూలింగ్ కాంప్యాక్ట్ బ్యాటరీ కలిగిన ఈ ట్రాక్టర్ ధరను రూ.5.99 లక్షలుగా నిర్ణయించింది. డీజిల్ ట్రాక్టర్తో పోలిస్తే నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ-ట్రాక్టర్ కోసం ముందస్తు బుకింగ్లను సైతం సంస్థ ఆరంభించింది కూడా. గంటకు 24.93 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ ట్రాక్టర్ బ్యాటరీ 8 గంటల పాటు బ్యాకప్ ఇవ్వనున్నది. రెండు టన్నుల ట్రాలీని అవలీలగా తీసుకుపోనున్నది. కేవలం నాలుగు గంటల్లో బ్యాటరీ చార్జ్ కానున్నది. వ్యవసాయ ఉత్పత్తుల్లో నూతన శకం ఆరంభమైందని, దీంట్లోభాగంగా దేశీయ రైతుకు నూతన టెక్నాలజీతో ఉత్పత్తులను అందించాలనే ఉద్దేశంతో ఈ నూతన ట్రాక్టర్ను విడుదల చేసినట్లు కంపెనీ ఈడీ రామన్ మిట్టల్ తెలిపారు.
తాజావార్తలు
- నిర్మాణ అద్భుతం దేవుని గుట్ట ఆలయం
- ఈ టీ తాగితే బరువు తగ్గొచ్చు
- జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి కేటీఆర్
- మార్చి 12 నుంచి ప్రచారం మొదలుపెడుతా: మిథున్ చక్రవర్తి
- కిడ్స్ జోన్లో ఎంజాయ్ చేసిన టీమిండియా క్రికెటర్లు.. వీడియో
- ఆగస్టు 31 నుంచి కార్లలో కో-డ్రైవర్ ఎయిర్బ్యాగ్ మస్ట్.. మళ్లీ ధరలమోత!
- మాచా టీతో డిప్రెషన్ దూరం..!
- ప్రతి ఇంటికి ప్రభుత్వ సాయం : మంత్రి కొప్పుల
- హర్మన్ప్రీత్ కౌర్ అరుదైన ఘనత
- మోదీకి దీదీ కౌంటర్.. గ్యాస్ సిలిండర్తో పాదయాత్ర