Social Media | కరోనా మహమ్మారి పుణ్యమా.. అని ఆన్లైన్లో వస్తువుల విక్రయాలు పుంజుకున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ప్రచార ప్రభావంతో విక్రయాలు భారీగా పెరిగాయి. అది ఈ ఏడాది చివరికల్లా రూ.900 కోట్లకు చేరుకోనున్నదని ఓ సంస్థ సర్వేలో తేలింది. ప్రతియేటా 25 శాతం వృద్ధిరేటు సాధిస్తూ 2025 నాటికి రూ.2,200 కోట్లకు చేరుకుంటుందని ఐఎన్సీఏ ఇండియా ఇన్ఫ్ల్యూయెన్సర్ రిపోర్ట్ అంచనా వేసింది.
కరోనా మహమ్మారికి ముందు అంటే 2019లో 40 కోట్ల మంది మాత్రమే సోషల్ మీడియా వేదికలపై ఆన్లైన్ కొనుగోళ్లు జరిపేవారు. కానీ గత 18 నెలల్లో సోషల్ మీడియా వేదికలపై కొనుగోళ్లు ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళ్లాయి. నేరుగా కస్టమర్లతో వివిధ బ్రాండ్ల అనుసంధానం కూడా పెరిగిపోయింది.
సుమారు మూడింట రెండొంతుల భారతీయులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ఆధారపడుతున్నారు. పర్సనల్ కేర్ ఉత్పత్తులు 25 శాతం, ఫుడ్ అండ్ బేవరేజెస్ 20 శాతం, ఫ్యాషన్ అండ్ జ్యువెల్లరీ 15 శాతం, మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 10 శాతం సోషల్ మీడియా ప్రభావంతో కొనుగోళ్లు జరుగుతున్నాయి.