హైదరాబాద్ సెంటర్ను మరింత విస్తరించనున్న సంస్థ
న్యూఢిల్లీ, మార్చి 19: ఆఫీస్ స్థలాలు అద్దెకు ఇచ్చే స్మార్ట్వర్క్స్ తన వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి రూ.250 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ ఏడాది చివరినాటికి మొత్తం 70 లక్షల చదరపు అడుగులకు చేరుకోనున్నదని తెలిపింది. ఈ వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్తోపాటు బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్లలో ఉన్న సెంటర్లను మరింత విస్తరించనున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు నితీష్ సర్దా తెలిపారు.