న్యూఢిల్లీ: వరుసగా పెరుగుతూ వచ్చిన అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా చౌకయ్యాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం బంగారం ధర రూ.210 తగ్గి రూ.47,310కి దిగొచ్చింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ళు నిలిచిపోవడంతో కిలో వెండి రూ.980 తగ్గి రూ.70,640కి దిగొచ్చింది. డాలర్కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో పసిడి ధరలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,834 డాలర్లకు, వెండి 27.34 డాలర్ల వద్ద నిలిచాయి.