తెలంగాణతోపాటు ఏపీల్లో 350 మంది సిబ్బంది నియామకం
హైదరాబాద్, సెప్టెంబర్ 8: తక్కువ వడ్డీకే గృహ రుణాలు అందించే ముంబైకి చెందిన శ్రీరామ్ హౌజింగ్ ఫైనాన్స్..తెలుగు రాష్ర్టాల్లో వ్యాపారాన్ని విస్తరించడానికి 350 మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు ప్రకటించింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లలో వ్యాపారాన్ని మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ అందుకు తగ్గట్టుగా ప్రణాళికలను రచిస్తున్నది. ప్రస్తుతం తెలంగాణలో 50 శాఖలు ఉండగా, వచ్చే ఏడాదిలోగా వీటిద్వారా నెలకు రూ.100 కోట్ల రుణ వితరణ లక్ష్యంగా పెట్టుకున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఏపీలో రూ.5,730 కోట్లు, తెలంగాణలో రూ.17,970 కోట్ల మేర రుణాలు అందించింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈవో రవి సుబ్రమణియన్ మాట్లాడుతూ..చౌక ధర కలిగిన ఇండ్లకు ఎనలేని డిమాండ్ ఉండటంతో వ్యాపారాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలని నిర్ణయించినట్లు చెప్పారు.