ముంబై, మే 11: కొవిడ్ వాక్సిన్ తయారీ కంపెనీ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా&ఏ ఇతర ఫార్మా కంపెనీ ఆర్జించనంత లాభాల మార్జిన్లను సాధించింది. రూ.5,446 కోట్ల అమ్మకాలపై ఏకంగా రూ. 2,251 కోట్ల లాభాన్ని (41 శాతం) ఆర్జించింది. ఇండియాలో ప్రస్తుతం దాదాపు ఫార్మా కంపెనీలన్నీ రూ.5,000 కోట్ల అమ్మకాల బ్రాకెట్లో వున్నవే. అయితే ఇంతశాతం లాభాన్ని ఆర్జించిన కంపెనీ సీరమ్ మాత్రమే. సీరమ్ అభివృద్ధిపర్చిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ను ఇండియాలో అటు ప్రభుత్వం, ఇటు ప్రైవేటు హాస్పిటళ్లు విస్త్రతంగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ కంపెనీ 15 కోట్ల వాక్సిన్ డోసుల్ని సరఫరా చేసింది. మరో 11 కోట్ల డోసుల్ని ఈ నెలలో సరఫరా చేయవచ్చని అంచనా. సీరమ్ ఇనిస్టిట్యూట్ను ప్రమోట్ చేసిన పూనావాలా గ్రూప్ హర్స్బ్రీడింగ్, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, ఏవియేషన్ రంగాల్లో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తున్నది.