న్యూఢిల్లీ: భారత స్టాక్ మార్కెట్లు సరికొత్త చరిత్ర సృష్టించాయి. సూచీలు ఆల్టైం హైలో రికార్డవడంతో స్టాక్మార్కెట్ల చరిత్రలో మరో మైలురాయిని అధిగమించాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూలతతోపాటు ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు పుంజుకోవడంతో మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ తొలిసారి 60 వేల మైలురాయిని అధిగమించింది. ప్రస్తుతం 350 పాయింట్లకుపైగా లాభంతో 60,230 ఎగువన కొనసాగుతున్నది. అదేవిధంగా నిఫ్టీ 18 వేల పాయింట్లకు సమీపంలో నిలిచింది. 104.55 పాయింట్ల లాభంతో 17,931 వద్ద కొనసాగుతున్నది.
దేశంలో అగ్రగామి సంస్థలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహింద్రా, ఓఎన్జీసీ, గ్రాసివ్ షేర్ల విలువ 52 వారాల గరిష్టానికి చేరాయి. వీటితోపాటు ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఎల్ అండ్ టీ టెక్ సర్వీసెస్, సీజీ పవర్, అపోలో హాస్పిటల్స్ షేర్ల విలువ సరికొత్త స్థాయిలకు చేరాయి.