ముంబై: ఆర్థిక ఏడాది చివరి రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ఫలితాల కారణంగా దేశీయ మార్కెట్లు నష్టపోయాయి. బుధవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి నష్టాల్లోనే కదలాడిన సూచీలు ఆఖరుకు భారీ నష్టాలతో ట్రేడింగ్ను ముగించాయి. 50,049 పాయింట్ల వద్ద ఇవాళ ట్రేడింగ్ను ప్రారంభించిన సెన్సెక్స్ 627 పాయింట్లు కోల్పోయి 49,509 వద్ద ముగిసింది.
ఇక, ఉదయం 14,811 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ 154 పాయింట్లు నష్టపోయి 14,700 కంటే దిగువన 14,690 వద్ద స్థిరపడింది. యూపీఎల్, గెయిల్, ఐటీసీ లాభాలను ఆర్జించగా, హెచ్డీఎఫ్సీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహీంద్రా భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. నిన్నటి భారీ ర్యాలీ నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం మార్కెట్ల పతనానికి ఒక కారణమైందని విశ్లేషకులు చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
సెప్టెంబర్ 30 వరకు పాత పద్ధతిలోనే ఆటో డెబిట్ సౌకర్యం..!
వైర్లెస్ స్పీకర్, ఫేస్ మసాజర్లో దొంగ బంగారం..!
85 శాతం కొత్త కేసులు ఎనిమిది రాష్ట్రాల్లోనే: కేంద్రం
కొవిషీల్డ్ షెల్ఫ్ లైఫ్ను 9 నెలలకు పొడిగించిన డీసీజీఐ
అమెజాన్ ప్రైమ్ వీడియోలో టెనెట్
మాస్క్ కిందికి.. నేను పైకి.. ముంబై పోలీసుల వినూత్న ప్రచారం
శరద్ పవార్ కు శస్ర్త చికిత్స విజయవంతం
60 ఏళ్ల లోపువారికి ఆస్ట్రాజెనికా టీకా నిలిపివేత..
ఆ నాలుగు నగరాల్లో నైట్ కర్ఫ్యూ పొడగింపు..!
మాకు హిందూ ముస్లిం భేదం లేదు: అమిత్ షా