ముంబై, మార్చి 31: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి స్టాక్ మార్కెట్లు నష్టాలతో వీడ్కోలు పలికాయి. బ్లూచిప్ సంస్థల షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరుగడంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ మళ్లీ 50 వేల దిగువకు పడిపోయింది. ప్రారంభం నుంచి నష్టాల బాట పట్టిన సూచీ చివరకు 627.43 పాయింటు ్ల(1.25 శాతం) తగ్గి 49,509.15లకు జారుకోగా, నిఫ్టీ 154.40 పాయింట్లు (1.04 శాతం) తగ్గి 14,690.70 పాయింట్లకు జారుకున్నది. అయినప్పటికీ 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ
విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు (ఎఫ్పీఐ) పోటెత్తాయి. బుధవారంతో ముగిసిన 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారతీయ మార్కెట్లలోకి వచ్చిన నికర ఎఫ్పీఐల విలువ ఏకంగా రూ.2.6 లక్షల కోట్లపైనే. ఓవైపు కరోనా వైరస్ భయాలు వెంటాడుతున్నా.. దేశ ఆర్థిక ప్రగతిపై విశ్వాసంతో విదేశీ మదుపరులు పెట్టుబడులకే ప్రాధాన్యతనిచ్చా రు. ఈ క్రమంలోనే మునుపెన్నడూ లేనివిధంగా స్టాక్ మార్కెట్లలోకి రూ.2,74,503 కోట్ల పెట్టుబడుల్ని తెచ్చారు. ఇప్పటిదాకా 2012-13లో వచ్చిన రూ.1.4 లక్షల కోట్లే రికార్డు. తాజాగా ఇది తుడిచిపెట్టుకుపోయింది. అయితే రుణ మార్కెట్ల నుంచి రూ.24,070 కోట్ల పెట్టుబడుల్ని విదేశీ మదుపరులు వెనక్కి తీసుకున్నారు. అయినప్పటికీ హైబ్రిడ్ సెక్యూరిటీల్లోకి రూ.10,238 కోట్లను తరలించారు. దీంతో నికర ఎఫ్పీఐల విలువ రూ.2,60,671 కోట్లుగా ఉన్నది.
ఇవీ కూడా చదవండి