ముంబై: భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. సూచీలు రోజంతా నష్టాల్లోనే కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై పాజిటివ్ ప్రభావం చూపాయి. దాంతో ఆర్థిక, బ్యాంకింగ్, లోహ, టెలికాం వంటి కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆసియాలోని పలు ప్రాంతాల్లో కొవిడ్ కేసులు ఒక్కసారిగా పెరుగడం సూచీలపై ప్రభావం చూపింది. దాంతో ఆర్థికవ్యవస్థ పునరుత్తేజంపై మదుపర్లలో సందేహాలు తలెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చివరకు సెన్సెక్స్ 587 పాయింట్ల నష్టంతో 52,553 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 171 పాయింట్లు నష్టపోయి 15,752 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.74.87 వద్ద నిలిచింది. బీఎస్ఈ సూచీలో ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్ షేర్లు మాత్రమే లాభాల్లో ముగియగా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ, బజాజ్ ఫినాన్స్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, టైటాన్ షేర్లు నష్టాలు చవిచూశాయి.