ముంబై: స్టాక్ మార్కెట్లు ( Stock markets ) ఇవాళ భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 456 పాయింట్లు నష్టపోయి 61,259 వద్ద ముగిసింది. మదుపరులు లాభాలు వెనక్కు తీసుకోవడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ సైతం 152 పాయింట్లు నష్టపోయి 18,266 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ ప్యాక్లో టైటాన్ టాప్ లూసర్గా ఉన్నది. హిందూస్థాన్ యునీలీవర్, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్ సర్వీస్, ఎల్ అండ్ టీ, పవర్ గ్రిడ్ కంపెనీలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ సూచీలు లాభాలు ఆర్జించాయి.