ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టాలను చవిచూశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఐటీ రంగ షేర్లు రాణించడంతో సూచీలు మధ్యాహ్నం వరకు లాభాల్లో కొనసాగాయి. కానీ చివరలో విద్యుత్తు, బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సెన్సెక్స్ చివరకు 66 పాయింట్ల నష్టంతో 52,482 వద్ద.. నిఫ్టీ 26 పాయింట్లు నష్టపోయి 15,721 వద్ద స్థిరపడ్డాయి.
డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.32 వద్ద నిలిచింది. బీఎస్ఈ 30 సూచీలో ఇన్ఫోసిస్, రిలయన్స్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, మారుతీ, భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ముగియగా.. బజాజ్ ఫిన్సర్వ్, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫినాన్స్, ఎల్ అండ్ టీ, టాటా స్టీల్, ఎస్బీఐ, హెచ్యూఎల్ షేర్లు నష్టాలు చవిచూశాయి.