ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. ఈ వారమంతా ఒడిదొడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు చివరి రోజైన శుక్రవారం మాత్రం సానుకూల ఫలితాలలో ముగిశాయి. ఈ ఉదయం 48,969 పాయింట్ల వద్ద ట్రేడింగ్ను ప్రారంభించిన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 568 పాయింట్లు లాభపడి 49,008 వద్ద ముగిసింది.
ఇక, ఉదయం 14,506 వద్ద రోజును ప్రారంభించిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 182 పాయింట్లు ఎగబాకి 14,507 వద్ద ముగిసింది. టాటా స్టీల్, బజాజ్ ఫిన్సెర్వ్, ఏసియన్ పెయింట్స్, హిందాల్కో లాభాల్లో పయనించగా.. యూపీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐయిచర్ మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ నష్టాలు మూటగట్టుకున్నాయి.