బంజారాహిల్స్, జూలై 10: కారు కొనకుండానే కార్ లోన్ తీసుకుని ముత్తూట్ మినీ సంస్థను మోసం చేసిన తల్వార్ కార్స్ సంస్థ డైరెక్టర్పై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఛీటింగ్ కేసు నమోదైంది. పోలీసుల ప్రకారం, బంజారాహిల్స్ రోడ్ నం:12లోని తల్వార్ కార్స్ సంస్థ డైరెక్టర్ సాకేత్ తల్వార్ తాను కారు కొంటున్నానంటూ నమ్మిం చి హిమాయత్నగర్లోని ముత్తూట్ మినీ లిమిటెట్ సంస్థ నుంచి రూ.33.73 లక్షలు రుణం తీసుకున్నాడు. సొంత సంస్థలోనే కారును కొంటున్నానని, ఒరిజినల్ ఇన్వాయిస్తో పాటు మిగిలిన పత్రాలు ఇస్తానంటూ 2018 అక్టోబర్లో రుణం తీసుకున్నాడు. అయితే, చెప్పి న విధంగా కారుకు సంబంధించిన పత్రాలు ఇవ్వకపోవడంతో పాటు కొన్ని ఇన్స్టాల్మెంట్స్ కట్టిన తర్వాత ఆపేశాడు.
తమ వద్ద తీసుకున్న రుణంతో కొనుగోలు చేసిన కారును సీజ్ చేసేందుకు వెళ్లగా అసలు కారును కొనకుండానే రుణం తీసుకున్నాడని తేలింది. ఇదే విధంగా అనేక సంస్థల వద్ద కార్ లోన్స్ తీసుకుని భారీ మోసాలకు పాల్పడ్డట్లు వెల్లడైంది. తల్వార్ కార్స్ డైరెక్టర్ సాకేత్ తల్వార్ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ముత్తూట్ మనీ లిమిటెడ్ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి 16న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయి తే, కేసు నమోదు చేయకపోవడంతో బాధితులు మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు సాకేత్ తల్వార్ మీద ఐపీసీ 420, 406, 506తో పాటు 156(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.