దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నూతన రికార్డుల దిశగా ర్యాలీ కావడంతో ఇన్వెస్టర్లు రూ.3.20 లక్షల కోట్ల మేరకు సంపద పెంచుకున్నారు. మార్కెట్లు నూతన రికార్డులు నెలకొల్పడానికి.. గురువారం పాజిటివ్ వాతావరణం నెలకొనడానికి మూడు కారణాలు ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలపరిచాయి. ఫలితంగా ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్లో 1000 పాయింట్లకు పైగా దూసుకెళ్లి.. చివరకు 958.03 పాయింట్ల (1.63%)తో ముగిసింది. తాజా ఆల్టైం రికార్డు 59,957.25 పాయింట్లకు (60 వేల మార్క్కు కేవలం 43 పాయింట్లే తక్కువ) చేరుకుంది. నిఫ్టీ కూడా 276.30 పాయింట్లు లాభ పడి 17,822.95 పాయింట్ల వద్ద స్థిర పడింది. అమెరికా ఫెడ్ రిజర్వ్ ఇప్పటికిప్పుడు వడ్డీరేట్లు పెంచబోమని ప్రకటించింది. స్పష్టంగా తేదీ ప్రకటించకున్నా నవంబర్ ప్రారంభంలో వడ్డీరేట్లు పెంచుతామని సంకేతాలచ్చిందే గానీ తేదీ వెల్లడించలేదు. దీంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలపడింది.
అప్పుల ఊబిలో చిక్కుకున్న చైనా రియాల్టీ దిగ్గజం ఎవర్గ్రాండ్.. ఈ వారం ప్రారంభంలో ప్రపంచ మార్కెట్లలో భారీగా నష్టపోయింది. ఆన్షోర్ బాండ్లపై కూపన్ చెల్లింపులు చేస్తామని ఎవర్గ్రాండ్ యూనిట్ ఒకటి చెప్పింది. అంతే కాదు త్వరలో ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడతామని కూడా హామీ ఇచ్చింది. చైనాలోని బ్యాంకులకు చైనా పీపుల్స్ బ్యాంక్ 1700 కోట్ల డాలర్ల నిధులు విడుదల చేయడంతో అంతర్జాతీయంగా సెంటిమెంట్ బలపడింది. దీని ప్రభావం ఇండియన్ మార్కెట్లపైనా పడింది.
ఇటీవలి కాలంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి ఎఫ్పీఐ పెట్టుబడులు వచ్చి చేరుతున్నాయి. రుణల ఊబిలో చిక్కుకున్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలు కోలుకునేందుకు వీలుగా కేంద్రం రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించింది. వివిధ బ్యాంకులకు వొడాఫోన్ రూ.30 వేల కోట్ల మరకు రుణ బకాయిలు ఉన్నాయి. వివిధ రంగాలకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ప్రకటించింది కేంద్రం.