న్యూఢిల్లీ, జూన్ 11: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం రికార్డుల మోత మోగించాయి. సెన్సెక్స్ 174.29 పాయింట్లు పుంజుకుని మునుపెన్నడూ లేనివిధంగా 52,474. 76 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 61.60 పాయింట్లు ఎగిసి ఆల్టైమ్ హై 15,799.35 వద్ద స్థిరపడింది. ఇంట్రా-డేలో సెన్సెక్స్ 52,641.53 పాయింట్లను తాకింది. ఐటీ, ఫార్మా, ఎనర్జీ షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. సెన్సెక్స్లో డాక్టర్ రెడ్డీస్ షేర్ విలువ అత్యధికంగా 3.03 శాతం లాభపడింది. కాగా, గత రెండు రోజుల్లో బీఎస్ఈ మదుపరుల సంపద రూ.3,26,165.82 కోట్లు ఎగిసింది.
దేశంలోని విదేశీ మారకద్రవ్య నిల్వలు తొలిసారి 600 బిలియన్ డాలర్లను దాటా యి. ఈ నెల 4తో ముగిసిన వారంలో 6.842 బిలియన్ డాలర్లు పెరిగాయని రిజ ర్వ్ బ్యాంక్ తెలియజేసింది. దీంతో 605.008 బిలియన్ డాలర్లకు చేరాయి. విదేశీ ఆస్తుల్లో పెరుగుదల కలిసొచ్చింది.