న్యూఢిల్లీ, జూలై 15: కార్పొరేట్ లాభాల పట్ల ఆశాభావంతో ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరపడంతో గురువారం స్టాక్ సూచీలు సరికొత్త రికార్డుల్ని నెలకొల్పాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 255 పాయింట్లు పెరిగి చారిత్రాత్మక గరిష్ఠస్థాయి 53,159 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 53,266 పాయింట్ల వరకూ పెరిగింది. నిఫ్టీ 70 పాయింట్లు ఎగిసి 15,924 పాయింట్ల వద్ద ముగిసింది.
రూ.2.22 లక్షల కోట్లు పెరిగిన సంపద మూడు రోజుల వరుస లాభాలతో బీఎస్ఈ మదుపరుల సంపద రూ.2.22 లక్షల కోట్ల మేర పెరిగింది.