ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ( Stock markets ) భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఐటీ రంగంలో అమ్మకాల ఒత్తిడి ఇవాళ మార్కెట్లు నష్టాల్లో కొనసాగడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాలు మూటగట్టుకోవడం కూడా దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపిందంటున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్.. 837 పాయింట్లు నష్టపోయి 59,240 వద్ద కొనసాగుతున్నది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 261 పాయింట్లు నష్టపోయి 17,593 వద్ద ట్రేడవుతున్నది.