ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
35వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి
ఎదులాపురం, జూలై 6 : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రాం అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. బాబు జగ్జీవన్ రాం 35వ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం ఆయన విగ్రహానికి జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్తో కలిసి పూలమాల వేశారు. నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అణగారిన కులాల అభివృద్ధితో పాటు వారిని చైతన్యపర్చేందుకు జగ్జీవన్రాం ఎనలేని కృషిచేశారన్నారు. తన 27వ ఏటే ఎమ్మెల్యేగా గెలిచారని, ఎంపీగా 6 దఫాలు, ఉప ప్రధానిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారని గుర్తుచేశారు. ఆయన ఆశయ సాధన దిశగా తెలంగాణ సర్కారు రాష్ట్రంలో 90 శాతం బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రైతుబందు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పరమేశ్వర్, నాయకులు రాంకుమార్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ..
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదిలాబాద్ రూరల్ పరిధిలోని ఏడుగురు లబ్ధిదారులకు జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్తో కలిసి జోగు రామన్న కల్యాణలక్ష్మి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడపిల్లలకు పెళ్లికానుకగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలుచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.