న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. అంబానీలపై భారీ జరిమానా వేసింది. టేకోవర్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ముకేశ్ అంబానీ, అనిల్ అం బానీలకు బుధవారం రూ.25 కోట్ల ఫైన్ విధించింది. ముకేశ్ సతీమణి నీతా అంబానీ, అనిల్ భార్య టీనా అంబానీలతోపాటు కేడీ అంబానీ ఇతర కుటుంబ సభ్యులకు కలిపి ఈ జరిమానా పడింది. 2000 సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్లో సంస్థ ప్రమోటర్లు 6.83 శాతం వాటాను పొందారు. అయితే ఈ వివరాలను బయటకు చెప్పలేదని, అంతేగాక పరిమితికి మించి లావాదేవీలు జరిగాయని సెబీ తాజా ఆదేశాల్లో పేర్కొన్నది. ఈ క్రమంలోనే జరిమానా వేస్తున్నట్లు స్పష్టం చేసింది.