న్యూఢిల్లీ: ఆదానీ గ్రూప్కు చెందిన పలు సంస్థలను సెబీ, డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు తనిఖీ చేస్తున్నారని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా ఆదానీ గ్రూప్ కంపెనీలు పని చేస్తున్నాయా.. లేదా అన్న అంశాన్ని సెబీ, డీఆర్ఐ దర్యాప్తు చేస్తున్నాయని సోమవారం సభ్యులు అడిగిన రాతపూర్వక ప్రశ్నలకు జవాబుగా చెప్పారు.
అయితే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వీటిపై దర్యాప్తు చేయడం లేదని పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. దేశంలోని స్టాక్ ఎక్స్చేంజిల్లో ఆదానీ గ్రూప్కు చెందిన ఆరు కంపెనీలు లిస్టెడ్ అయి ఉన్నాయి. రోజువారీ ట్రేడింగ్ను బట్టి ఆయా సంస్థల్లో విదేశీ పోర్ట్ ఫోలియో పెట్టుబడులు (ఎఫ్పీఐ) కలిగి ఉన్నాయి.
అబ్దుల్లా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సంస్థల నుంచి ఆదానీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులను జూన్లో సెబీ స్తంభింపచేసిందని పంకజ్ చౌదరి వివరణ ఇచ్చారు.
తర్వాత నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) కూడా ఆదానీ గ్రూపుల్లో సదరు ఎఫ్పీఐల ఖాతాలను స్తంభించచేయలేదని పేర్కొంది. సెబీ, ఎన్ఎస్డీఎల్ ఆంక్షలతో గత నెలలో ఆదానీ గ్రూప్ సంస్థల షేర్లు భారీగా పతనం అయ్యాయి.
ఢిల్లీలో రూ.47 వేల దిగువకు బంగారం
చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ
పెట్టుబడులను విశ్వవ్యాప్తం చేద్దాం
పర్సనల్ లోన్కు ఎప్పుడెళ్లాలి
పెగాసస్ టార్గెట్లో రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిషోర్..
ఫడ్నవీస్ హయాంలో ఫోన్ హ్యాకింగ్ : కాంగ్రెస్
మరోవారం కర్ఫ్యూ పొడగింపు.. ఎక్కడంటే?