న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: కంపెనీ షేరు ధరల కృత్రిమ కదలికలకు కారణమైన 80 సంస్థలు, ఐదుగురు వ్యక్తులపై సెబి ఒక్కసారిగా వేటువేసింది. సన్రైజ్ ఆసియన్ను, ఆ కంపెనీకి చెందిన ఐదుగురు డైరెక్టర్లను క్యాపిటల్ మార్కెట్ల నుంచి ఏడాదిపాటు నిషేధిస్తున్నట్లు సోమవారం మార్కెట్ నియంత్రణా సంస్థ సెబి తెలిపింది. సన్రైజ్కు అనుసంధానంగా వ్యవహరించిన మరో 79 సంస్థల్ని ఆరునెలలు నిషేధించింది. 2012 అక్టోబర్ 16 నుంచి 2015 సెప్టెంబర్ 30 వరకూ సన్రైజ్ స్క్రిప్ కదలికలపై దర్యాప్తుచేసిన అనంతరం సెబి ఈ చర్య తీసుకుంది.