న్యూఢిల్లీ: పేమెంట్స్ బ్యాంక్ నెట్వర్క్ ఏర్పాటు చేసేందుకు భారీ స్థాయిలో ప్రైవేట్ కంపెనీలకు ఆహ్వానం పలికేందుకు రూపొందించిన ప్రణాళికను రద్దు చేసుకోవాలని ఆర్బీఐని ఎస్బీఐ యూనియన్, గ్లోబల్ అలయెన్స్ కోరాయి. ఈ మేరకు ఆర్బీఐకి లేఖ రాశాయి. పేమెంట్స్ నెట్వర్క్ ప్రైవేటీకరణ వల్ల డేటా భద్రతతో రాజీ పడాల్సి వస్తుందని హెచ్చరించాయి.
పేమెంట్స్ సెక్టార్లో రిస్క్లను తగ్గించే లక్ష్యంతో పేమెంట్స్ నెట్వర్క్ ఏర్పాటు చేయడానికి న్యూ అంబరిల్లా ఎంటిటీస్ (ఎన్యూఈ) కూటముల నుంచి ఆర్బీఐ గతేడాది బిడ్లను ఆహ్వానించింది. నేషనల్ పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కు వ్యతిరేకం అని పేర్కొన్నాయి.
ఎన్యూఈకి లైసెన్స్ ఇస్తే డిజిటల్, ఏటీఎం లావాదేవీలతోపాటు న్యూ పేమెంట్స్ సిస్టమ్స్ను ఆహ్వానించడమేనని తెలిపారు. ఈ లైసెన్స్ కోసం ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ తదితర సంస్థలు భారతీయ కార్పొరేట్ సంస్థలు రిలయన్స్/ ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి పేమెంట్స్ నెట్వర్క్ ఏర్పాటు చేయడానికి బిడ్లు దాఖలు చేశాయి.
దేశీయ పేమెంట్స్ నెట్వర్క్ల్లో మల్టీ నేషనల్ కంపెనీల ప్రాభల్యం పెరిగితే, యూజర్ల డేటా దుర్వినియోగం అవుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఎన్యూఈ లైసెన్సింగ్ ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి, దేశీయ పేమెంట్ గ్రూప్ అనుబంధం ఎన్పీసీఐ అభివ్రుద్ధికి చర్య తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ లేఖపై ఆర్బీఐ ఇంకా ప్రతి స్పందించలేదు. భారత ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్కు ఎన్పీసీఐ వెన్నెముకగా ఉంది. ఈ నేపథ్యంలో అమెజాన్, గూగుల్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలకు భారత డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ ఆకర్షణీయంగా మారింది.
అసోచామ్-పీడబ్ల్యూసీ ఇండియా అధ్యయనం ప్రకారం 2019 నాటికి దేశీయ డిజిటల్ పేమెంట్స్
65 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయి. 2023 నాటికి 135 బిలియన్ల డాలర్లకు చేరుకుంటాయని అంచనా. అమెజాన్ కూడా బిడ్ దాఖలు చేసింది.
ఉద్యోగులకు ఆకర్షణీయ వీఆర్ఎస్?
వృద్ధిరేటు 8.3%కు కుదించిన ప్రపంచబ్యాంకు.. ఎందుకంటే?!
పియాజియో వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్, వేరియంట్లు ఇలా..
ఫ్రాంక్లిన్పై సెబీ రూ.5 కోట్ల ఫైన్
వృద్ధిరేటు 8.3%కు కుదించిన ప్రపంచబ్యాంకు.. ఎందుకంటే?!
ఆ రెండు బ్యాంకులపై ఆర్బీఐ ఫైన్.. ఎందుకంటే?!
ఇరాన్పై ఆంక్షలు ఎత్తేయకుంటే పెట్రోల్ పైపైకే!
కోవిడ్ ఔషధాలపై 5 శాతానికి జీఎస్టీ మినహాయింపు? ఇంకా..!!