ముంబై, ఆగస్టు 16: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ సోమవారం రిటైల్ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచిన సందర్భంగా, రాబోయే పండుగ సీజన్ దృష్ట్యా వాహన, బంగారం రుణాలపై వడ్డీరేట్లను తగ్గించిన బ్యాంక్.. ప్లాటినం టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ప్రాసెసింగ్ ఫీజులనూ రద్దు చేసింది. ‘ఈ ఆఫర్లు మా కస్టమర్లకు మరింత ఆర్థిక ప్రయోజనాన్ని అందించగలవని మేము విశ్వసిస్తున్నాం’ అని ఎస్బీఐ రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ విభాగం ఎండీ సీఎస్ శెట్టి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక పరిమిత కాలానికిగాను వర్తించే ఈ ఆఫర్లను పరిశీలిస్తే..
హెల్త్కేర్ వర్కర్లకు..
కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న ఫ్రంట్లైన్ హెల్త్కేర్ వర్కర్లతోపాటు కొవిడ్ వారియర్లకూ ఎస్బీఐ ఆఫర్లను ప్రకటించింది. వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే 50 బేసిస్ పాయింట్ల ప్రత్యేక వడ్డీ రాయితీ ఉంటుందని స్పష్టం చేసింది. త్వరలో కారు, బంగా రం రుణాల దరఖాస్తుదారులకూ వడ్డీ రాయితీని వర్తింపజేస్తామని తెలిపింది. ఇప్పటికే ఈ నెలాఖరుదాకా గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపును ఎస్బీఐ కల్పించిన విషయం తెలిసిందే. గృహ రుణాలపై ప్రారంభ వడ్డీరేటు 6.70 శాతంగానే ఉంచింది బ్యాంక్.
డిపాజిట్లపై..
వివిధ రకాల రుణాలపై ఆఫర్లను తెచ్చి రుణగ్రహీతలను ఉత్సాహపరిచిన ఎస్బీఐ.. డిపాజిట్దారులనూ ఆకర్షించే ప్రయత్నం చేసింది. రిటైల్ డిపాజిటర్ల కోసం ‘ప్లాటినం టర్మ్ డిపాజిట్ల’ ఆఫర్ను పరిచయం చేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ ఆఫర్ కింద 75 రోజులు, 75 వారాలు, 75 నెలల కాలపరిమితిగల డిపాజిట్లపై 15 బేసిస్ పాయింట్ల వరకు అదనపు వడ్డీ ప్రయోజనాన్ని ఇచ్చింది. సాధారణ ప్రజలు, సీనియర్ సిటిజన్లకు వేర్వేరు వడ్డీరేట్లు వర్తిస్తాయి. కనిష్ఠంగా 3.95 శాతం, గరిష్ఠంగా 6.20 శాతంగా ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
వాహన రుణాలపై..
బంగారం రుణాలపై..