న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ఎస్బీఐ రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని బేస్రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. దీంతో బేస్రేటు 7.45 శాతానికి పరిమితమైంది. బేస్రేటుతో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటు మరింత తగ్గనున్నది. దీంతోపాటు ప్రైమ్ లెండింగ్ రేటుని కూడా 5 బేసిస్ పాయింట్లు కోత విధించడంతో రుణరేటు 12.20 శాతానికి పరిమితమైంది.