గోల్నాక, జూలై 12 : నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. సోమవారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. దీంతో పాటు ఏఏ ప్రాంతాల్లో కొత్తగా రహదారులు ఏర్పాటు చేయాలో వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అధికారులకు తెలిపారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఈఈ సుధాకర్, సంతోష్, ఏఈ ప్రేరణ, వర్క్ ఇన్స్పెక్టర్ రవి పాల్గొన్నారు.