విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ తన సతీమణి కిరణ్ ఖేర్ బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నట్టు తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. కిరణ్ పలు సినిమాలలో నటించడంతో పాటు ఇప్పుడు బీజేపీ ఎంపీగా పని చేస్తున్నారు. అయితే కొన్నాళ్లుగా కిరణ్ బ్లడ్ క్యాన్సర్తో బాధ పడుతున్నట్టు జోరగా ప్రచారం సాగింది. దీనిపై అనుపమ్ తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. కిరణ్ ప్రస్తుతం మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటుండగా, ఇంతక ముందుకన్నా స్ట్రాంగ్గా మన ముందుకు రానుందని మేము విశ్వసిస్తున్నాము.
కిరణ్ పోరాట యోధురాలు. మంచి దయా హృదయం గల వ్యక్తి. ఆమెను ప్రేమించే వారు చాలా మంది ఉన్నారు. మీ ప్రార్దనల వలన ఆమె త్వరగానే కోలుకుంటుంది. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తన ట్వీట్లో పేర్కొన్నారు అనుపమ్. కాగా, కిరణ్ ఖేర్ ప్రస్తుతం ముంబైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కిరణ్ ఖేర్ కు గత సంవత్సరం నవంబరు 11వతేదీన చండీఘడ్ లోని తన ఇంట్లో ఎడమచేయి విరిగింది. దీంతో ఆమెకు చంఢీఘడ్ లోని పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో వైద్యపరీక్షలు చేయించడంతో మల్టిపుల్ మైలోమా ఉన్నట్లు నిర్ధారణ అయింది.