విభిన్న పాత్రలతో అటు సినిమాలు.. ఇటు వెబ్సిరీస్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు సత్యదేవ్. ఎప్పటికప్పుడూ తన నటనతో కట్టిపడేసే సత్యదేవ్.. ఇప్పుడు ఓ ఆసక్తికరమైన కథతో రాబోతున్నాడు. దర్శకుడు విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో స్కైలాబ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. సత్వదేవ్,నిత్యా మీనన్,రాహుల్ రామకృష్ణ ఈ ముగ్గురు అంతరిక్షంలో నుండి పడిపోతున్న ఉపగ్రహంలో కూర్చున్నట్టు ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకిత్తిస్తుంది.
1979లో జరిగిన స్కైలాబ్ ఘటాధారంగా ఈ సినిమా రూపొందుతుంది. అమెరికా మొదటి అంతరిక్ష కేంద్రం అయిన స్కైలాబ్ భూమిపై పడినప్పుడు బండలింగంపల్లిలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉండబోతోంది. సత్యదేవ్ నటించిన తిమ్మరుసు.. త్వరలోనే విడుదల కానుంది. కాగా ప్రస్తుతం ఆయన చేతిలో గాడ్సే, గుర్తుందా శీతాకాలం సినిమాలు ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
బీచ్లో పూజాహెగ్డే..ఎక్కడికి వెళ్లిందో..?
అఖిల్ కండలు చూసి అవాక్కవుతున్న ఫ్యాన్స్
తేజ్ను చూస్తే ఎమోషనల్ అవుతా: కొరటాల శివ
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి