కౌలాలంపూర్: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో భారత షట్లర్లు పీవీ సింధు, సాయిప్రణీత్కు సులువైన ‘డ్రా’లు ఎదురయ్యాయి. విశ్వక్రీడల్లో సింధు ఆరో సీడ్గా గ్రూప్-జెలో పోటీపడనుండగా.. సాయిప్రణీత్ 13వ సీడ్గా గ్రూప్-డిలో బరిలోకి దిగనున్నాడు. లీగ్ స్టేజ్ మ్యాచ్ల్లో ప్రపంచ 34వ ర్యాంకర్ చెంగ్ గ్యాన్ యీ, 58వ ర్యాంకర్ సెనియా పాలికర్పోవా (ఇజ్రాయిల్)తో సింధు తలపడనుంది. పురుషుల విభాగంలో మార్క్ కాల్జోవ్ (నెదర్లాండ్స్), మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయిల్)తో సాయిప్రణీత్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్శెట్టి జోడీకి కఠిన డ్రా ఎదురైంది.