ముంబై: ప్రస్తుతం కరోనా వేళ ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా ( Health Insurance ) తప్పనిసరి. ఇందుకోసం దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ అనుబంధ జనరల్ ఇన్సూరెన్స్ ఆకర్షణీయ ప్లాన్తో.. ‘ఆరోగ్య సుప్రీం’ అనే పేరుతో సరికొత్త బీమా పాలసీని అందుబాటులోకి తెచ్చింది.
మీరు కట్టే ప్రీమియంను బట్టి రూ.5 కోట్ల వరకు కవరేజీ ఆప్షన్ కల్పిస్తున్నది. మూడు డిఫరెంట్ ఆప్షన్లు ఇస్తున్నది. ప్రో, ప్లస్, ప్రీమియం ఆధారిత మొత్తం కవరేజీ ఈ బీమా ప్లాన్లో ఉన్నాయి. రికవరీ బెనిఫిట్, సమ్ ఇన్సూర్డ్ రీఫిల్, పరిహారం చెల్లింపు తదితర ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది ఎస్బీఐ
అంతే కాదు ఒక ఏడాది నుంచి మూడేండ్ల వరకు పాలసీ కవరేజీ ఉంటుంది. ఖాతాదారులు తమ అవసరాలకు అనుగుణంగా తమ అనువైన ప్లాన్ను ఎంచుకోవచ్చు.
రీ ఇన్స్టేట్మెంట్ ఫీచర్తోపాటు విస్త్రత శ్రేణి బీమా కవరేజీతో ఆరోగ్య సుప్రీం పాలసీ సమగ్ర హెల్త్ ఇన్సూరెన్స్ అని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ కం సీఈవో పీసీ కండ్పాల్ చెప్పారు.
20 బేసిక్ కవర్స్, 8 ఆప్షనల్ కవర్స్తోపాటు పూర్తి స్థాయి బీమా కవరేజీ కల్పిస్తున్న బీమా పాలసీగా ఆరోగ్య సుప్రీం నిలుస్తుంది.
కరోనా థర్డ్ వేవ్ తప్పదు.. అదీ త్వరలోనే: ఇండియన్ మెడికల్ అసోసియేషన్
నార్కో టెర్రర్ను ఆపాలి: అమిత్ షా
కశ్మీర్ను లూటీ చేసేందుకే ఆర్టికల్ 370 రద్దు
నిబంధనలు పాటించని ఫలితం.. జన్పథ్ మార్కెట్ మూసివేత
లఢాక్లో చొరబడిన చైనా సైనికులు.. దలైలామా బర్త్డే వేడుకలపై నిరసన
అంతరిక్షం నుంచి భూమిని చూడడం అద్భుతం: శిరీష బండ్ల