బంజారాహిల్స్,జూలై 10: జీహెచ్ఎంసీ పరిధిలో రూ.137కోట్ల వ్యయంతో 57 థీమ్ పార్కులను అభివృద్ధి చేస్తున్నామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 92లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోనోలిత్ థీమ్ పార్కును శనివారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి ప్రారంభించారు.నగరంలో ఇప్పటికే 919 పార్కులను అభివృద్ధి చేశామని, 504 ట్రీ పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ..జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 92లో ఏర్పాటు చేసిన మోనోలిత్ థీమ్ పార్కును 11వందల గజాల స్థలంలో ఏర్పాటు చేశామన్నారు.తక్కువ సమయంలోనే సుందరమైన థీమ్ పార్కును సిద్ధ్దం చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, జోనల్ కమిషనర్ ప్రావీణ్య, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెంకటేశ్, మాజీ కార్పొరేటర్ సూర్యనారాయణ, నర్సింగరావు పాల్గొన్నారు.