హైదరాబాద్ : తన కార్డుదారులకు పండుగ సీజన్ ఆనందాన్ని రెట్టింపు చేసే ఉద్దేశంతో ఎస్బీఐ కార్డ్ మూడు రోజుల మెగా షాపింగ్ ఫెస్టివ్ ఆఫర్ 2021 ‘దమ్ దార్ దస్’ ను ప్రకటించింది. 2021 అక్టోబర్ 3 నుంచి ఇది ప్రారంభమవుతుంది. ఆన్ లైన్ షాపింగ్ ఫెస్టివల్ సందర్భంగా ఎస్బీఐ కార్డ్ రిటైల్ కార్డుదారులు ఏ దేశీయ ఇ-కామర్స్ సైట్ పై అయి నా ఆన్ లైన్ షాపింగ్ చేసి ఒకటి కాదు, రెండు కాదు…పది శాతం క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు.
ముఖ్యంగా ఈఎంఐ లావాదేవీలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఆన్ లైన్ మర్చంట్ ఈఎంఐ లావాదేవీలకు కూడా ఈ ఆఫర్ లభ్యమవుతుంది. ఎస్బీఐ కార్డ్ అద్భుత ఆఫర్లను అందిస్తోంది. తాము కోరుకునే ఏ దేశీయ ఇ-కామర్స్ సైట్ పై అయినా ఆన్ లైన్ షాపింగ్ చేసేందుకు ఇది కస్టమర్లకు సాధికారికత కల్పిస్తుంది. ఖాతాదారులు విస్తృత రకాల ఉత్పాదనలను కొనుగోలు చేయవచ్చు. క్యాష్ బ్యాక్ పొందవచ్చు. మొబైల్స్, యాక్సెసరీస్, టీవీ, లార్జ్ అప్లియెన్సెస్, ల్యాప్ టాప్ లు, టాబ్లెట్స్, హోమ్ ఫర్నిషింగ్, కిచెన్ అప్లియెన్సెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, స్పోర్ట్స్, ఫిట్ నెస్ లాంటివెన్నో వీటిలో ఉన్నాయి.
బీమా, ప్రయాణం, వాలెట్, ఆభరణాలు, చదువు, ఆరోగ్య సంరక్షణ, యుటిలిటీ మర్చంట్స్ లాంటి ఆన్ లైన్ వ్యయాలకు ఇది వర్తించదు. ఎస్బీఐ కార్డ్ ఫెస్టివ్ ఆఫర్ 2021 గురించి ఎస్బీఐ కార్డ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రామమోహన్ రావు అమర మాట్లాడుతూ, ‘‘మా స్థాయిని పెంచుకునేందుకు మేం డేటా అనలిటిక్స్ శక్తిని ఉపయోగించుకుంటున్నాం. కొన్నేళ్లుగా మేం మా కార్డుదారులు విస్తృత వేదికలపై, వివిధ ఉత్పాదన విభాగాల్లో, మరీ ముఖ్యంగా పండుగ సందర్భాల్లో, ఆన్ లైన్ షాపింగ్ పై లావాదేవీలు అధికం చేయడాన్ని గమనించాం.
కస్టమర్ కేంద్రిత సంస్థగా మేం మా కస్టమర్ల మారుతున్న అవసరాలకు అనుగుణంగా వారిక అత్యుత్తమ ప్రయోజనాలను అందించే మా ర్గాల కోసం నిరంతరం అన్వేషిస్తుంటామని తెలిపారు. మరిన్ని వివరాల కోసం www.sbicard.com వెబ్సైట్లో చూడొచ్చు.