మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కి ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం లాక్డౌన్ తర్వాత విడుదలై భారీ కలెక్షన్స్ రాబట్టింది. వెండితెరపైనే కాక ఓటీటీలోను, బుల్లితెరపై కూడా ఉప్పెన సినిమా మంచి ఆదరణ దక్కించుకుంది.
ఏప్రిల్ 18న ఉప్పెన సినిమా తొలి సారి బుల్లితెరపై ప్రసారం కాగా, అప్పుడు 18.5 టీఆర్పీ వచ్చింది. ఇప్పుడు రెండో సారి ప్రసారం కాగా, 11.37 దక్కింది. అయితే అదే సమయంలో ఉప్పెనకు పోటీగా తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమా వేరే ఛానల్లో ప్రసారం అయింది. ఈ సినిమా తొలి సారి ప్రసారం అయినప్పుడు 4.8 టీఆర్పీ రేటింగ్ దక్కించుకోగా, తాజాగా 3.8 రేటింగ్ పొందింది. దళపతి విజయ్ కంటే మెగాహీరో మూవీ మెగా టిఆర్పీ రేటింగ్ రాబట్టుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.