Satya Nadella | మైక్రోసాఫ్ట్ను కర్బన రహితంగా తీర్చి దిద్దుతామని ప్రకటించినందుకు ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్లకు గ్లోబల్ బిజినెస్ సస్టెయినబిలిటీ లీడర్షిప్లో ప్రఖ్యాత సీకే ప్రహ్లాద్ అవార్డ్ లభించింది. భారతీయ అమెరికన్ ప్రహ్లాద్ గౌరవార్థం 2010లో కార్పొరేట్ ఈకో ఫోరమ్(సీఈఎఫ్) ఈ అవార్డును ఏర్పాటు చేసింది.
అంతర్జాతీయప్రైవేట్ రంగంలో అసాధారణ రీతిలో, వినూత్నతతో పర్యావరణ హిత కార్యక్రమాలను నిర్వహిస్తూ, దీర్ఘకాల వ్యాపార విజయాలు సాధిస్తున్న వారికి ఈ అవార్డు ఇస్తుంటారు. నాదెళ్లతో పాటు మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్, వైస్ ఛైర్ బ్రాడ్ స్మిత్, సీఎఫ్ఓ అమీ హుడ్, చీఫ్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ లుకాస్ జొప్ప కూడా ఈ గౌరవాన్ని అందుకున్నారు.
2030 కల్లా కర్బన రహిత సంస్థగా మైక్రోసాఫ్ట్ను మారుస్తామని, 2050 కల్లా చరిత్రాత్మక ఉద్గారాలన్నిటినీ తొలగిస్తామని ప్రకటించి.. అందుకు కలిసికట్టుగా పనిచేస్తున్నందుకు ఈ ప్రఖ్యాత అవార్డు దక్కింది.