ముంబై: కార్లైల్ సంస్థకు వాటాల విక్రయం ద్వారా నిధులు సేకరించాలన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ నిర్ణయంపై సెబీకి షాక్ తగిలింది. కార్లైల్ సంస్థకు వాటాలను విక్రయించి రూ.4000 కోట్ల నిధులు చేపట్టాలని పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ నిర్ణయించింది. మంగళవారం జరిగే ప్రత్యేక వార్షిక సమావేశం (ఈజీఎం)లో దీనికి ఆమోదం తెలుపాలని పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ భావించింది.
ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించే వరకు ముందుకు వెళ్లొద్దని ఇంతకుముందు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థను సెబీ ఆదేశించింది. సెబీ ఆదేశాలకు వ్యతిరేకంగా పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ సోమవారం సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (శాట్)లో అప్పీల్ చేసింది.
పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ పిటిషన్ను విచారణకు స్వీకరించిన శాట్.. మంగళవారం పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ఈజీఎం నిర్వహణకు అనుమతించింది. అయితే, ఈజీఎం తీర్మానాలను ఎన్ఎస్డీఎల్కు తెలియజేయాలని సూచించింది.
తదుపరి ఆదేశాలిచ్చే వరకు తీర్మానాలను బహిర్గతం చేయొద్దని పేర్కొంది. తదుపరి విచారణ వచ్చే నెల ఐదో తేదీన జరుగనున్నది.