శామీర్పేట, ఏప్రిల్ 11 : ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల్లో స్నేహభావం, మానసి ఉల్లాసాన్ని పెంపొందించడానికి క్రికెట్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) ఉపయోగపడుతాయని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం శామీర్పేట, మూడుచింతల్పల్లి మండలాల్లో సీపీఎల్ నిర్వహించేందుకు అలియబాద్లో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో శామీర్పేటలో 10 టీంలు, మూడుచింతల్పల్లి నుంచి 13 టీంలతో పాటు పోలీస్, ప్రెస్ టీంలకు డ్రా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారాయణపూర్ టీం డ్రా ద్వారా నేరుగా సెమిఫైనల్కు ఎంపిక అయ్యిందన్నారు. యాడారం గ్రామ పరిధిలోని క్రికెట్ స్టేడియంలో రోజుకు మూడు మ్యాచ్ల చొప్పున లీగ్ మ్యాచ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సీపీఎల్ను మంత్రి చామకూర మల్లారెడ్డి ఈనెల 16వ తేదీ (శుక్రవారం) ఉదయం 8:30 గంటలకు ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి తాళ్ల జగదీశ్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, ఎంపీపీ ఎల్లూబాయిబాబు, రైతుబంధు మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, మూడుచింతల్పల్లి మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, సర్పంచులు మోహన్రెడ్డి, కుమార్యాదవ్, భాస్కర్, ఎంపీటీసీలు ఇందిరారాజిరెడ్డి, సింగిరెడ్డి ఇందిరా, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు విష్ణుగౌడ్, మాజీ ప్రధానకార్యదర్శి సతీశ్రెడ్డి, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.