న్యూఢిల్లీ, ఆగస్టు 11: సామ్సంగ్ బుధవారం గెలాక్సీ జెడ్ సిరీస్లో రెండు సరికొత్త ప్రీమియం ఫోల్డబుల్ 5జీ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. ఫోల్డ్3 ధర రూ.1,33,565గా ఉంటే, ఫ్లిప్3 ధర రూ.74,203గా ఉన్నది. అయితే దేశీయ మార్కెట్లోకి ఇవి ఎప్పుడు వస్తాయన్నది మాత్రం కంపెనీ ప్రకటించలేదు. సెప్టెంబర్ రెండో వారం నుంచి అందుబాటులో ఉంటాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు వీటి ప్రీ-ఆర్డర్లు మొదలవగా, హై ఫ్రీక్వెన్సీ కెమెరా, భారీ టచ్ స్క్రీన్ వంటి అబ్బురపరిచే ఫీచర్లతో ఇవి కస్టమర్ల ముందుకు రానున్నాయి. ఇదిలావుంటే రూ.11,130 ధరతో గెలాక్సీ ఇయర్ బడ్స్నూ విడుదల చేసిన సామ్సంగ్.. గెలాక్సీ వాచ్4, వాచ్4 క్లాసిక్ స్మార్ట్వాచీలనూ తీసుకొచ్చింది. ధరల శ్రేణి రూ.18,550 నుంచి 22,260గా ఉన్నది.