న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్ మలైకా ఆరోరా కోవిడ్ టీకా తీసుకున్నది. ఇవాళ వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్నట్లు ఆమె తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. మలైకా వయసు ప్రస్తుతం 47 ఏళ్లు. 45 ఏళ్లు దాటిన వారికి కోవిడ్ టీకా ఇస్తున్న విషయం తెలిసిందే. తన ఇన్స్టా సందేశంలో.. అభిమానుల్ని టీకా వేసుకోవాలని ఆమె కోరారు. వైరస్పై యుద్ధంలో గెలవాలన్నారు. టీకా తీసుకోవడం మరిచిపోవద్దు అంటూ ఆమె తన మెసేజ్లో పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి తాను అర్హురాలని ఆమె తన మెసేజ్ను సైనాఫ్ చేసింది. గత ఏడాది సెప్టెంబర్లో మలైకా ఆరోరాకు కరోనా వైరస్ సంక్రమించిన విషయం తెలిసిందే. పాజిటివ్ తేలిన తర్వాత ఆమె క్వారెంటైన్లో ఉన్నారు. ఆమె బాయ్ఫ్రెండ్ అర్జున్ కపూర్కు కూడా అదే సమయంలో కరోనా వచ్చిన విషయం తెలిసిందే.