ముంబై: ఇండియన్ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. 2004లో పిలిచిన ఐపీవోలో ఓ ఇన్వెస్టర్ రూ.850 మదుపు చేశాడు.. అది ఈ రోజు రూ.28 వేలయిందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు.
గురువారం సంస్థ 26వ వార్షిక సాధారణ సమావేశంలో చంద్రశేఖరన్ మాట్లాడుతూ టీసీఎస్ ఐపీవోలో పెట్టుబడి పెట్టిన మదుపు గత 17 ఏండ్లలో 3000 రెట్లు పెరిగిందన్నారు. కరోనా మహమ్మారి వేళ కంపెనీ కస్టమర్ల నుంచి అద్భుతమైన మంచి పేరు సంపాదించుకున్నదని చెప్పారు.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తమ కంపెనీ నిరంతరం నూతన సర్వీసులు అందిస్తున్నదని చంద్రశేఖరన్ తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభాల్లో 25.9 శాతం పురోగతిని నమోదు చేసుకున్నది. ప్రతి షేర్పై రూ.38 డివిడెండ్ చెల్లిస్తున్నట్లు చంద్రశేఖరన్ చెప్పారు.