త్వరలో కేంద్రం నుంచి మూలధన సాయం
న్యూఢిల్లీ, మార్చి 12: రిజర్వ్ బ్యాంక్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (పీసీఏ) కింద ఉన్న పలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాబోయే కొద్ది రోజుల్లో రూ.14,500 కోట్ల నిధులను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా సంస్థల ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చడంలో భాగంగా ఈ నిధులను కేంద్రం అందివ్వనున్నది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్లు ప్రస్తుతం పీసీఏలో ఉన్నాయి. దీంతో వీటిపై వివిధ ఆంక్షలు అమల్లో ఉండగా, రుణాల మంజూరుతోపాటు నిర్వహణ వ్యయం, డైరెక్టర్ల ఫీజులు తదితర అంశాల్లో బ్యాంకులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.