చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ ఒప్పో వరుసగా 5జీ ఫోన్లను భారత్లో విడుదల చేస్తూ వినియోగదారులను
ఆకట్టుకుంటోంది. త్వరలో మరో కొత్త 5G స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. ఒప్పో A74 5G ఫోన్ను ఏప్రిల్ 20న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఒప్పో ఎ74 ఫోన్ ధర 20వేల లోపు ఉంటుందని కంపెనీ ధ్రువీకరించింది. ఒప్పో నుంచి చౌకైన 5జీ ఫోన్ ఇదేనని తెలిపింది. A74 మోడల్ను ఈనెల ప్రారంభంలో థాయ్లాండ్లో విడుదల చేశారు. ఈ ఫోన్లో పంచ్ హోల్ డిస్ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇది ఫ్లూయిడ్ బ్లాక్, స్పేస్ సిల్వర్ కలర్లలో అందుబాటులో ఉంది.
డిస్ప్లే: 6.50 అంగుళాలు
ఫ్రంట్ కెమెరా:16 ఎంపీ
రియర్ కెమెరా: 48+8+2+2 ఎంపీ
ర్యామ్: 6జీబీ
స్టోరేజ్: 128జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 5000mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 11