Rich Indians For Private Jets | పండుగల సీజన్ వచ్చేస్తుంది.. దసరా.. విజయదశమి.. దీపావళి పండుగలు సంతోషంగా.. సరదాగా గడపడానికి సంపన్న భారతీయులు విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్లు వేసుకున్నారు. సొంతంగా తమ కుటుంబాల కోసం చార్టర్డ్ ఫ్లైట్లకు డిమాండ్ పెరిగింది. దసరా.. దీపావళి పండుగలు వచ్చే అక్టోబర్, నవంబర్ నెలల్లో విదేశాలకు వెళ్లే వారి నుంచి ప్రైవేట్ చార్టర్డ్ విమానాలకు గిరాకీ ఎక్కువైంది. పండుగల గతేడాదితో పోలిస్తే 24 శాతం ఎక్కువగా సంపన్నులు చార్టర్డ్ విమానాలు బుక్ చేసుకున్నారని జెట్ ఫ్లీట్ ఏవియేషన్ డైరెక్టర్ శానిల్ దేశాయ్ చెప్పారు.
కరోనా ఆంక్షలను సడలించిన విదేశీ నగరాల్లో పండుగల సీజన్ గడుపడానికి డిమాండ్ ఎక్కువగా ఉన్నారు. వచ్చే డిసెంబర్ వరకు వెకేషన్ చార్టర్ కేంద్రాలకు వెళ్లే విమానాలకు గిరాకీ కొనసాగుతుందని శానిల్ దేశాయ్ అన్నారు. దుబాయ్, థాయిలాండ్, బాలి, మాల్దీవులు, మాస్కో వంటి ఇంటర్నేషనల్ కేంద్రాలకు వెళ్లేందుకు 60 శాతానికి పైగా కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారని ఆసియా-పసిఫిక్ ఆఫ్ ఎయిర్బోర్న్ ప్రైవేట్ జెట్ ఎమర్జెన్సీ మిషన్ కంట్రోలర్ సిమి కురియాకోస్ తెలిపారు.
సంపన్నులు సింగిల్ చార్టర్ ఫ్లైట్లో ఆరుగురి నుంచి ఎనిమిది మంది ప్రయాణికులకు టికెట్ల బుకింగ్కు ప్రాధాన్యం ఇస్తారని చెబుతున్నారు. మిగతా 35-40 శాతం బుకింగ్స్ ఢిల్లీ, ముంబై వాసులు పండుగలు సజావుగా జరుపుకునేందుకు సొంతూళ్లకు చార్టర్డ్ ఫ్లైట్స్ బుక్ చేసుకున్నారు.
వచ్చే పండుగల సీజన్లో చార్టర్డ్ ఫ్లైట్ల బుకింగ్స్.. అదీ కూడా దేశీయ, అంతర్జాతీయ కేంద్రాలకు బుకింగ్స్ నాటకీయంగా పెరిగాయని జెట్-సెట్గో ఏవియేషన్ ప్రతినిధి కనికా టెక్రివాల్ చెప్పారు. ప్రతి యేటా పండుగల సీజన్ బిజీగా ఉండేదని అలోఫ్ట్ ఏవియేషన్ ఎండీ నిషా శర్మ చెప్పాన్నారు. కమర్షియల్ ఎయిర్లైనర్స్తో పోలిస్తే ఈ ఏడాది ప్రైవేట్ జెట్ విమానాలకు ఎక్కువ డిమాండ్ ఉందన్నారు.
మాల్దీవులు, దుబాయ్, శ్రీలంక, ఉక్రెయిన్, రష్యాతోపాటు ఇతర యూరోపియన్ దేశాల్లోని కేంద్రాలకు వెళ్లేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో సంపన్నులంతా దేశీయంగా జైపూర్, కోల్కతా, ఉదయ్పూర్, జోధ్పూర్, జైసల్మేర్, విదేశాల్లో మాల్దీవులు, దుబాయి, ఖాట్మండు, కోహ్ సముయి, ఫుకెట్, సింగపూర్, బ్యాంకాక్, మారిషస్ వంటి పాపులర్ కేంద్రాలకు వెళ్లేవారు.