Retro Tax | వివాదాస్పద 2012 రెట్రోస్పెక్టివ్ టాక్స్ పాలసీకి కేంద్రం చరమ గీతం పాడాలని నిర్ణయించుకోవడానికి పెద్ద కారణాలే ఉన్నాయి. విదేశీ ఇన్వెస్టర్లకు విశ్వాసం కల్పించడంతోపాటు ఈ చట్టంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వొడాఫోన్, కెయిర్న్ ఎనర్జీ వంటి సంస్థలకు లబ్ధి చేకూరనున్నది.
ఈ చట్టం రద్దు చేయడం వల్ల కెయిర్న్ ఎనర్జీ, వొడాఫోన్ తదితర కంపెనీలు చెల్లించిన పన్నును వడ్డీ లేకుండా ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే, సదరు కంపెనీలు వివిధ దేశాల్లో దాఖలు చేసిన పరిహారం పిటిషన్లను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది.
పరిహారం కింద కెయిర్న్ ఎనర్జీ.. విదేశాల్లోని ఎయిర్ ఇండియా ఆస్తులను జప్తు చేసినందుకే రెట్రోస్పెక్టివ్ యాక్టును రద్దు చేస్తున్నామని అనడం అనుచితం అని రెవెన్యూశాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ చెప్పారు. విదేశీ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆయా సంస్థలకు ప్రభుత్వం సుమారు రూ.8,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
అప్పుల ఊబిలో చిక్కుకున్న వొడాఫోన్ ఐడియా చైర్మన్గా ప్రముఖ బిలియనీర్ కుమార్ మంగళం బిర్లా వైదొలగడంతోపాటు తన వాటా విక్రయానికి సిద్ధం అని కేంద్రానికి లేఖ రాశారు. దీంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా కోల్పోయింది.
రెట్రోస్పెక్టివ్ టాక్స్కు వ్యతిరేకంగా గతేడాది ఇంటర్నేషనల్ కోర్టుల్లో కెయిర్న్, వొడాఫోన్ పిటిషన్లు వేశాయి. నెదర్లాండ్స్లోని ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్.. రెండు కేసుల్లోనూ భారత్కు వ్యతిరేకంగా తీర్పులిచ్చింది. వొడాఫోన్ కేసులో న్యాయపమైన కేసుల కింద రూ.40 కోట్లు కేటాయించాలని ఆదేశించింది. ఈ చట్టం.. నెదర్లాండ్స్-భారత్ మధ్య ఒప్పందాల ఉల్లంఘనేనని పేర్కొంది. రెట్రోస్పెక్టివ్ చట్టం కింద రూ.22 వేల కోట్లు చెల్లించాలని వొడాఫోన్పై కేంద్రం ఒత్తిడి తెచ్చింది.
కెయిర్న్ ఎనర్జీకి 120 కోట్ల డాలర్లు (సుమారు రూ.8,800 కోట్లు) చెల్లించాలని భారత్ను ట్రిబ్యునల్ కోరింది. దీనికి అనుగుణంగా అమెరికా నుంచి సింగపూర్ వరకు వివిధ దేశాల్లోని భారత్ ఆస్తుల జప్తుకు కెయిర్న్ ఎనర్జీ ప్రణాళికలు రూపొందించింది.
గత మే నెలలో న్యూయార్క్లోని ఎయిర్ ఇండియా ఆస్తులను జప్తులను స్వాధీనం చేసుకోవడానికి కెయిర్న్ పిటిషన్ వేసింది. ఇక గత నెలలో రూ.177 కోట్ల విలువైన 20 భారత్ ఆస్తులను స్తంభింపజేయాలని ఫ్రాన్స్ న్యాయస్థానం ఆదేశించింది.