హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరం మొ దటి త్రైమాసికంలో సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంట్ (ఎస్టీపీపీ) దేశంలోని అత్యుత్తమ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. ఈ త్రైమాసికంలో 92.49 పీఎల్ఎఫ్(ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) సాధించింది. గడిచిన త్రైమాసికంలో సింగరేణి థర్మల్ ప్లాంట్ 2,424 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసింది. ఇందులో 2,283 మిలియన్ యూనిట్లను రాష్ట్ర అవసరాలకు వినియోగించారు. ఈ త్రైమాసికంంలో రూ.944 కోట్ల విలువైన విద్యుత్ను విక్రయించింది. ఇది గతేడాది తొలి త్రైమాసికం కంటే 32.83 శాతం అధికం. జాతీయ స్థాయిలో విద్యుత్ వినియోగం, విద్యుత్ పరిశ్రమల్లో ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం మొదలైన అంశాలను సమీక్షించే ముంబైకి చెందిన మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ సంస్థ అత్యుత్తమ ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ విభాగంలో సింగరేణి థర్మల్ ప్లాంట్కు బెస్ట్ ప్లాంట్ పెర్ఫార్మర్ అవార్డును ఇటీవలే ప్రదానం చేసింది. ైఇదే కృషిని కొనసాగిస్తూ మంచి పీఎల్ఎఫ్ సాధించాలని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ ప్లాంట్ ఉద్యోగులను కోరారు.