ఈ నెల 28 నుంచి పసిడి బాండ్ రూ.5 వేలు

రిజర్వుబ్యాంక్ మరోమారు సావరిన్ గోల్డ్ బాండ్లను విక్రయించబోతున్నది. ఈసారి ఒక్కో గ్రాము ధర రూ.5 వేలుగా నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను తొమ్మిదిసారి జారీ చేస్తున్న ఈ బాండ్లు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 1 వరకు విక్రయించబోతున్నది. గడిచిన మూడు రోజులుగా పసిడి ధరల సరాసరి ఆధారంగా ఈ బాండ్ ధరను నిర్ణయించింది. ఈ బాండ్లను కొనుగోలు చేయాలనుకునేవారికి మరో శుభవార్తను కూడా అందించింది. ఆన్లైన్, డిజిటల్ ద్వారా చెల్లింపులు జరిపేవారికి ఒక్కో గ్రాముపై రూ.50 వరకు రాయితీ కూడా ఇస్తున్నది. వీరు ఒక్కోగ్రాము బాండ్కు రూ.4,950 చెల్లిస్తే సరిపోతుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రిజర్వుబ్యాంక్ ప్రతియేటా 12సార్లు గోల్డ్ బాండ్లను జారీ చేస్తున్నది. పసిడి వినిమయాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ సర్కార్ ఈ బాండ్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కనీసంగా ఒక్క గ్రాము, గరిష్ఠంగా 4 కిలోల వరకు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.9,652.78 కోట్ల నిధులను సమీకరించింది.
తాజావార్తలు
- తమిళనాడులో పసందుగా పొత్తుల రాజకీయం
- కొవిడ్-19 వ్యాక్సిన్ : ప్రైవేట్ దవాఖానలో ధర రూ. 250గా ఖరారు!
- దేశంలో కరోనా విస్తృతిపై కేంద్రం ఉన్నతస్థాయి సమీక్ష
- మహారాష్ట్రలోని అమరావతిలో మార్చి 8 వరకు లాక్డౌన్
- ఉమెన్స్ డే సెలబ్రేషన్ కమిటీ నియామకం
- ఉల్లిపాయ టీతో ఉపయోగాలేంటో తెలుసా
- మోదీకి మరో అంతర్జాతీయ అవార్డు
- న్యాయమూర్తులపై దాడులు, ట్రోలింగ్ విచారకరం : కేంద్ర న్యాయశాఖ మంత్రి
- వాణీదేవిని గెలిపించాల్సిన బాధ్యత అందరిది : మహమూద్ అలీ
- ఆ డీల్ కుదరకపోతే 11 లక్షల ఉద్యోగాలు పోయినట్లే!