న్యూఢిల్లీ : రెనాల్ట్ ఇండియా పదో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆల్ న్యూ క్విడ్ ఎంవై21ను దేశీ మార్కెట్లో లాంఛ్ చేసింది. ఈ ఆకర్షణీయ, వినూత్న లోకాస్ట్ వాహనం గేమ్ ఛేంజర్గా మారుతుందని రెనాల్ట్ ఇండియా సేల్స్ పెంచేందుకు కీలకం కానుందని కంపెనీ ఆశిస్తోంది.
న్యూ క్విడ్ ఎంవై21 క్లింబర్ ఎడిషన్ డ్యూయల్ టోన్ ఎక్స్టీరియర్తో అందుబాటులో ఉంది. బ్లాక్ రూఫ్తో వైట్ కలర్లో ఈ కారు కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఎలక్ట్రిక్ ఓఆర్వీఎం, డే అండ్ నైట్ ఐఆర్వీఎం వంటి నూతన ఫీచర్లతో ముందుకొచ్చింది. ఇక రెనాల్ట్ క్విడ్ ఎంవై21 రూ 4.6 లక్షల నుంచి 4.36 లక్షల ధరల శ్రేణిలో అందుబాటులో ఉంది.